దగ్గుపాటి వెంకటేష్ ఇంట విషాద ఛాయలు

సినీ నటుడు , దగ్గుపాటి వెంకటేష్ ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. వెంకటేష్ బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు (73) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆరోగ్యం విషమం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. దీంతో దగ్గుబాటి అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలియగానే నిర్మాత సురేష్ బాబు బాపట్లలోని కారంచేడుకు చేరుకున్నారు. రెండో కుమారుడు అభిరామ్‌తో కలిసి వెళ్లిన ఆయన బాబాయి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అయితే, వెంకటేష్ మాత్రం షూటింగ్‌ కోసం ముంబైలో బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయినట్లు తెలిసింది. అయితే, ఈరోజు షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకొని బాబాయి చివరి చూపు కోసం కారంచేడు వెళ్తారని సమాచారం. ఆ తర్వాత మోహన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.