కరోనా ఎఫెక్ట్..డబ్బావాలా సేవలు నిలిపివేత
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలని నిర్ణయం
ముంబయి: ముంబయి మహనగరంలో ఉన్న డబ్బావాలలు మార్చి 31 వరకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా ఉదుృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మహరాష్ట్రలో డబ్బావాలాలు ప్రత్యేక చరిత్ర కలిగిఉన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు ప్రతీరోజు వారి వారి గృహలనుండి ఆహరాన్ని తీసుకువెళ్లి అందించేవారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కూడా వీరు సేవలను కొనసాగించారు. కాని నేడు రాష్ట్రంలో కరోనా భాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో, వ్యాప్తి నివారణ కొరకు ఈ నెల చివరి వరకు సేవలను బంద్ చేయాలని నిర్ణయించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/