పిలిప్సీన్స్లో ఫోన్ఫోన్ తుపాన్ బీభత్సం

పిలిప్పీన్స్: పిలిప్పీన్స్ దేశంలో తుపాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫాన్ఫోన్ తుపాను జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఫాన్ఫోన్ విలయంతో 16 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావంతో చెట్లు విరిగిపడుతున్నాయి. చాలాచోట్ల ఇళ్లు కూడా కూలాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/