ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపు

ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు సడలింపు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నేడు కొవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తున్నామ‌ని, ఈ నెల 21 నుంచి ఈ స‌డ‌లింపులు అమల్లోకి వ‌స్తాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవ‌డానికి అనుమతి ఉంటుంద‌ని, మ‌రో గంట సేప‌ట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని చెప్పారు.

క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావ‌రి జిల్లాలో ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంట‌ల‌ వరకే సడలింపు ఉంటుంద‌ని వివ‌రించారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా న‌డుస్తాయ‌ని తెలిపారు. తాజా స‌డ‌లింపులు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని వివ‌రించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/