శ్రీలంకలో నిరవధిక కర్ఫ్యూ విధింపు

రాష్ట్రపతి, ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రజల డిమాండ్

కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అట్టుడికేలా చేస్తోంది. సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకరూపు దాల్చాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధాని మహింద రాజపక్సేలు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. మరోవైపు పరిస్థితులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, లాఠీలతో దాడి చేశారు. ఈ దాడుల్లో 20 మంది వరకు గాయపడ్డారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/