క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా
ఉక్రెయిన్లోని శాంతియుత నగరాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో కీవ్లోని పలు ప్రాంతాలను రష్యా టార్గెట్ చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుని గెలుస్తుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచం వెంటనే స్పందించాలని, రష్యాపై వినాశకరమైన, వేగవంతమైన ఆంక్షలు విధించాలని కోరారు. రష్యాను అన్ని విధాలుగా, పూర్తిగా వేరు చేయాలన్నారు. ఉక్రెయిన్ కు ఆయుధాలు, పరికరాలు. ఆర్థిక, మానవతా సహాయం అందించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కోరారు.
జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/