రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పా ట్లు : సీపీ సీవీ ఆనంద్

cp-cv-anand-inspected-the-security-arrangements-at-the-parade-grounds

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇందుకోసం రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 3న పరేడ్​ గ్రౌండ్​లో జరగనున్న సభకు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు గ్రే హౌండ్స్, జిల్లాల నుంచి వచ్చే పోలీసులనూ ఇందుకోసం వినియోగిస్తామన్నారు. ఈ మేరకు బీజేపీ నేతలతో కలిసి పరేడ్​ గ్రౌండ్స్​లో భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సభా వేదిక వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్​ ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. బహిరంగ సభ పూర్తైన తర్వాత సభకు హాజరైన వారు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనాలు సభా వేదికకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.


ఈ నెల 3న పరేడ్ గ్రౌండ్స్‌ సభ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించాం. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మందితో పహారా ఏర్పాటు చేశాం. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టార్ ఇంఛార్జ్‌లుగా నియమించాం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/