శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చింది టీటీడీ. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ లో శ్రీ వారి సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపిన ఛైర్మన్ .. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేది వరకు సంభందించిన టికెట్ల ను విడుదల చేస్తూన్నామని వెల్లడించారు. రోజు కి 8 వేల చోప్పున టిక్కెట్లు విడుదల చేస్తామని తెలిపారు. తిరుమల దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని షరతులు పెట్టారు. 26 తేది నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్ లో జారి చేస్తున్న టోకెన్లు నిలిపి వేస్తూన్నామని స్పష్పం చేశారు.