వివాహ వేడుకలో 86 మందికి కరోనా పాజిటివ్
నిజామాబాదు జిల్లా సిద్దాపూర్లో కలకలం
Nizamabad: పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేగింది. ఆదివారం జరిగింది . నిజామాబాదు జిల్లా వర్ని మండలం సిద్దాపూర్లో పెళ్లికి హాజరైన వారిలో 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
అధికారులు అప్రమత్తమై సిద్దాపూర్ గ్రామంలో మూడు రోజులుగా పరీక్షల క్యాంప్ నిర్వహిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రభుత్వ క్వారన్టైన్ ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/