కొవిడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం నగరంలోని వెంగళ్రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ఈ కొవిడ్ కంట్రోల్ రూమ్ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా కరోనా థర్డ్ వేవ్ను, కరోనా ఇతర సమస్యలను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/