ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల..సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షా

Delhi CM Kejriwal

న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త కేసుల విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో కొవిడ్‌ పరిస్థితిని చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలో కొవిడ్‌ విస్తరిస్తున్న తీరు, మరింత వ్యాపించకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరవ్‌ భరద్వాజ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.