కరోనా బారిన పడిన కీరవాణి..టెన్షన్లో మెగా ఫ్యాన్స్

ఆస్కార్ అవార్డు విన్నర్ , ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి కరోనా బారినపడ్డారు. మూడేళ్లు గడిచిపోయినా కరోనా మహమ్మారి వదలడం లేదు. ఎక్కడో ఓ చోట కరోనా పేరు కలవరపెడుతూనే ఉంది. గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం తో కేంద్రం సైతం పలు రాష్ట్రాలకు అలర్ట్ జారీచేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా సంగీత దర్శకులు కీరవాణి కరోనా బారినపడడం ఇప్పుడు మెగా అభిమానుల్లో టెన్షన్ పెడుతుంది. తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా చేసిన వ్యక్తులు కీరవాణి, రైటర్ చంద్రబోస్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా ఆస్కార్ సంబరాల్లో ఉన్న సినీ జనాలకు కీరవాణి షాక్ ఇవొచ్చారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా వెల్లడించారు. మొన్న రాంచరణ్ బర్త్ డే సందర్భంగా కూడా ఆయన అక్కడ తన కుటుంబ సభ్యులను కలిసిన విషయం తెలిసిందే. దీంతో గర్భవతి అయిన ఉపాసన కూడా అప్రమత్తం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే కీరవాణిని కలిసిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలని కీరవాణి కోరినట్లు తెలుస్తోంది.