భారత్‌లో 21వేలకు చేరిన కరోనా కేసులు

681కి పెరిగిన మృతులు సంఖ్య..కేంద్ర ప్రభుత్వం బులిటెన్‌

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో మొత్తం 21,393 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1409 పెరిగాయి. మొత్తం 681 మంది చనిపోగా, 4258 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 16,454 మంది ఆస్పత్రుల్లో చికిత్స పోందుతున్నాట్లు తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/