ఢిల్లీలో న్యూఇయర్ సెలబ్రేషన్లపై ఆంక్షలు
నేడు, రేపు కర్ఫ్యూ
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు, అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సదర్భంగా రాత్రి సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని స్పష్టం చేసింది.
కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్ వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది. కరోనావైరస్ కొత్త ఉత్పరివర్తన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగరం సిద్ధంగా ఉందని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/