50 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ప్రపంపచవ్యాప్తంగా 3,29,719 కరోనా మరణాలు

worldwide corona

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 33 వేల 400. వ్యాధి నుంచి 20 లక్షల 21 వేల 813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయి వెళ్లారు. కాగా కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల 719 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వల్ల అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 1,561 మంది చనిపోయారు. వ్యాధి కారణంగా యూఎస్‌ఏలో ఇప్పటివరకు 94,994 మంది మరణించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటివరకు అత్యధికంగా మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూకే35,704, ఇటలీ32,330, ఫ్రాన్స్‌28,132, స్పెయిన్‌27,888, బ్రెజిల్‌18,894, బెల్జియం9,150, జర్మనీ8,270, ఇరాన్‌7,183, మెక్సికో6,090, కెనడా6,031, నెదర్లాండ్స్‌లో 5,748 మంది చనిపోయారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/