ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కేసులు
మొత్తం మృతుల సంఖ్య 5,36,786

హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,15,57,810 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,36,786 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 65,35,598 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల తీవ్రత నానాటికి పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 29,82,928 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,32,569 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 12,89,564 మంది కోలుకున్నారు. ఇక బ్రెజిల్తో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 16,04,585 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/