తెలంగాణలో మరో 1,597 కొత్త కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 796 కొత్త కేసులు

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,597 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 39,342కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 796 కొత్త కేసులు వచ్చాయి. బుధవారం 1,159 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,999కి పెరిగింది. ప్రస్తుతం 12,958 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం మరణాలు 386కి పెరిగాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/