మహారాష్ట్రలో ఒక్క రోజే 105 మంది మృతి

నిన్న ఒక్క రోజే 2,598 కేసుల నమోదు

corona virus
corona virus

మంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 105 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే, రాష్ట్రంలో గత 24 గంటల్లో 130 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య 2,095కి చేరుకుంది. 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,598 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 56,948కి పెరగ్గా, 1,897 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు, బీహార్, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీలలోనూ కరోనా విజృంభిస్తోంది. బీహార్‌లో మొత్తం కేసుల సంఖ్య 3 వేలు దాటగా, ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో ఏకంగా 443 కేసులు వెలుగుచూశాయి. వలస కార్మికుల రాకతో ఇక్కడ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మరోవైపు, కోలుకున్న కేరళలోనూ మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వారం రోజుల్లోనే అక్కడ 300 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/