భారత్‌లో ఆరు లక్షలు దాటిన కరోనా వైరస్‌ కేసులు

గత 24 గంటల్లో దేశంలో 19,148 మందికి కరోనా

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 19,148 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 434 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,04,641కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17834కి పెరిగింది. 2,26,947 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 90,56,173 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,29,588 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/