దేశంలో 640 కి చేరిన కరోనా మృతుల సంఖ్య !
భారత్లో మొత్తం 19,984 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజు పెరిగిపోతున్నాయి. దేశంలో 24 గంటలో కొత్తగా 1,383 కేసుల నమోదయ్యాయి. దీంతో సుమారు 50 మంది మరణించారు. కాగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,984కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 640 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,869 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 15,474 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా విజృంభణ..
మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 5,218కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 251 మంది మృతి చెందారు. గుజరాత్లో 2,178 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,156కి చేరింది. గుజరాత్లో ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 1,500పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ కేసులు 20,000కు చేరువలో ఉన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/