దేశంలో లక్ష దాటిన కరోనా వైరస్ కేసలు
24 గంటల్లో 4,970 మందికి కరోనా..మొత్తం మృతుల సంఖ్య 3,163
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 4,970 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్లో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,163కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,01,139కి చేరింది. మరోపక్క, ఇప్పటి వరకు కరోనా నుంచి 39,173 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/