దేశంలో 24 గంటల్లో 194 మంది మృతి

గత 24 గంటల్లో మరో 6,566 మందికి కరోనా..మొత్తం కేసుల సంఖ్య 1,58,333

corona virus – India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులతో పాటు మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా సోకగా, 194 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,58,333కి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/