భారత్ లో ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 9,06,752

corona virus- india

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,06,752కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,20,92,503 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,86,247 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కాగా ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వివరాలు తెలిపింది.


తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/