బీఆర్కే భవన్లో కరోనా కలకలం
బీఆర్కేభవన్, జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సిబ్బందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఏడో అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది అంతా హోంక్వారంటైన్లో ఉన్నారు. ఎనిమిదో అంతస్తు ఆర్థిక శాఖలోనూ కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీ ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/