ప్రపంచవ్యాప్తంగా కోటి 48 లక్షలు దాటిన కరోనా కేసులు
మొత్తం మరణాలు సంఖ్య 6,13,248
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. బాధితుల సంఖ్య కోటి 48 లక్షలు దాటింది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,48,55,107 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,13,248 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 89,07,167 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 39,61,429 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,43,834 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,49,989 మంది కోలుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/