తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
కొత్తగా 1,269 కేసులు నమోదు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతుంది. ఆదివారం కొత్తగా 1,269 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం 1,563 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 22,482కి పెరిగింది. ప్రస్తుతం 11,883 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాలు 356కి పెరిగాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/