కోవిడ్-19 బీమా పాలసీలు అవసరం
దేశవ్యాప్తంగా 7లక్షల పాజిటివ్ కేసులు
నేటికీ కరోనాతో దేశవ్యాప్తంగా ఏడులక్షల కేసులు, 20వేల మంది మరణాలతో మృత్యుఘంటికలు మోగిస్తుంది. దీని మూలంగా మధ్యపేద తరగతుల ప్రజలు హడలెత్తిపోతున్నారు.
పాలకులు కరోనా వైద్యానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పరచామంటూనే వారికి వైరస్సోకితే మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లుతున్నారు.
కరోనాకేమో సమభావం పాలకులకేమో స్వార్థభావమా అని పాలితుల ఆవేదన తీరడానికి కరోనా నివారణకి వ్యాక్సినో, జీవితానికి ధీమాకోసం బీమా పాలసీలు రావాలి.
పాలకులూ వెంటనే పాలితుల జీవితాల్లో ధీమా నింపండి. జీవిత బీమా అంటే జీవితంతో పాటు జీవితం తర్వాత కూడా అనే బీమా సంస్థల మాటలకు స్వార్థకత చేకూర్చండి.
బీ మా వ్యాపారం భారత దేశంలో లోతుగా పాతుకు పోయింది. మార్కెట్లోకి కొత్త పాల సీలను విడుదల చేసేందుకు జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు పోటీపడుతుంటాయి.
కొత్తకొత్త పాలసీలకు రూపకల్పన చేయడానికి వాటికవే అవకాశాలను సృష్టించుకుం టాయి.
భారతదేశంలో బీమా పరి శ్రమ ఐ.ఆర్.డి.ఎ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అండ్ ఆథారిటీ అనేది బీమా పరిశ్రమలను పరిపాలించే, పర్యవేక్షించే చట్టబద్ధమైన, స్వతంత్ర, అత్యున్నత, సంస్థ. దీని నిబంధన ప్రకారం కనుసన్నల్లో బీమా సంస్థల వ్యాపారం సాగుతుంది.
ఇది పాలసీదారుల ఆస్తికి హక్కులను రక్షించడం, బీమా పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం, నిర్ధారించడం, దావాలను వేగవంతంగా పరిష్కరించడం, మోసాలు దుర్వినియోగాలను నివారించడం, బీమాతో వ్యవహరించే ఆర్థిక మార్కెట్లలో పారదర్శకత, క్రమబద్ధ మైన ప్రవర్తనను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
ఇందులో పది మంది సభ్యులుంటారు.ఒక ఛైర్మన్, ఐదుగురు పూర్తికాల సభ్యు లు, నలుగురు పార్ట్టైం సభ్యులు, ఛైర్మన్లను భారత ప్రభుత్వం నియమిస్తుంది.
ఐ.ఆర్.డిఎ ఆఫ్ ఇండియాను పార్లమెంట్ చట్టం చేసి డిసెంబర్26, 2004లో భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేత ఏర్పాటు చేయబడింది.
బీమా సంస్థలు నేడు దేశంలో కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తూ మారణహోమం సృష్టిస్తుంటే దీనిని ప్రభుత్వం కట్టడి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంటే ప్రైవేట్చికిత్స కోసం రూ. లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది.
ఒకవేళ ఆరోగ్యం కుదుటపడ్డా ఆ వైరస్మిగిల్చే ఆర్థిక భారం కోలుకోలేని దెబ్బతీస్తుంది.
ఈ వ్యాధి తీవ్రత అంతగా లేని తొలినాళ్లలో తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు అంటూ వరుస కట్టినాయి. అయితే ఇవన్నీ రూ.25వేల నుండి లక్షరూపాయల మధ్యలోనే ఉండేవి. కొవిడ్-19 పాజిటివ్ వస్తే ఈపరిహారాన్ని అందిస్తామని చెప్పాయి.
కానీ పరిస్థితులు మారినాయి. ఇప్పటికీ తీసుకున్న ఆరోగ్యబీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఐ.ఆర్.డి.ఏ చెప్పడంతో బీమా సంస్థలు ఈప్రత్యేక పాలసీల జోరును తగ్గించాయి. మరి కొన్ని బీమా సంస్థలు వాటిని ఇవ్వడమే మానేశాయి.
‘డిసీజ్ స్పెసిఫిక్గా కరోనా కోసం ప్రత్యేకంగా రెండురకాల పాలసీలను తీసుకురావాలని నియంత్రణసంస్థ కొన్ని మార్గదర్శకాలను రూపొం దించింది. అన్ని బీమా సంస్థలు ఒకే ప్రామాణిక నిబంధనలతో ఈ పాలసీ జూన్ 15 వరకు తీసుకురావాలని తెలిపింది.
ఉలుకూ పలుకు లేని బీమా సంస్థల తీరుతో తర్వాత జూన్ 20కి గడువ్ఞ పెంచింది.కానీ బీమా సంస్థలు మరింత సమయం కావాలనడంతో జులై 10లోగా కొత్త పాలసీలను తేవాలన్నది. దానికి సంబంధించి మార్గదర్శకాలు, పాలసీల పేర్లను విడుదల చేసింది. ఈ సారికైనా ఈ కొత్త పాలసీలు వస్తాయా! అనే సందేహం వెంటాడుతుంది.
బీమా సంస్థలు ఐ.ఆర్.డి.ఓ మార్గదర్శకాలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ కాలం నెట్టుకొస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత కష్టకాలం లో బీమా సంస్థలు ఇష్టానుసారంగా పాలసీలను తీసుకురాకుండా కట్టడి చేసేలా ఐ.ఆర్.డి.ఏ కరోనా కోసం తెచ్చే పాలసీలకు మార్గదర్శకాలు రూపొందించి ప్రీమియం నిర్ణయాధికారం బీమా సంస్థలకేఇచ్చింది.
దేశం మొత్తం అది ఒకే ప్రీమియం ఉండాలని నిబంధనలు విధించింది. బీమా సంస్థల లెక్కలు ఎలా ఉన్నా ఐ.ఆర్డి.ఎ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పాలసీలు తీసుకురావా ల్సిందే. కాని వీటకి ఆదరణ లభించకుండా బీమా సంస్థలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి.
బీమా సంస్థలు పై రెండు పాలసీలను తెస్తే ప్రజలకు ప్రయోజనం కల్పించిన వారవ్ఞతారు. దీనితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల ధనదోపిడీని కట్టడి చేయాల్సిందని గమనిం చండి. దేశం మొత్తం ఒకే ప్రీమియం వర్తింపుతోపాటు ఏడాది పాలసీలు అవసరమంటున్న నిపుణుల సూచన కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఈ ప్రత్యేక పాలసీలు వస్తే మా వ్యాపారం తగ్గుతుం దనే భావన వీడి, బీమా సంస్థలు ప్రజాప్రయోజనాల దృష్ట్యా మానవీయకోణంలో ఆలోచించాలి.
ఇప్పటికే ఐ.ఆర్.డి.ఎ మార్గ దర్శకాలతో వచ్చిన ఆరోగ్యసంజీవని పాలసీని బీమా సంస్థ పెద్దగా ప్రచారం చేయడం లేదు ఇది భావ్యమా!బీమా నియం త్రణ, అభివృద్ధి ప్రాధికారసంస్థ చెప్పిందని పేరుకే ఈ పాలసీలను తీసుకురావడం వలన ఉపయోగం లేదు.
వీటికి ప్రజల ఆర్థికస్థితిగ తులదృష్ట్యా వాటి ప్రీమియం నిర్ణయించడం,ప్రచారం చేయడంతో పాటు వీలైతే పేద ప్రజల ప్రీమియాన్ని పాలకులే భరించాలి. ఈ కష్టకాలంలో సామాన్యుడికి భరోసా ఇచ్చేలా చూడాలి.
కరోనా విపరీతంగా విజృంభిస్తున్నవేళ ఈ పాలసీలు ఎంత తొందరగా వస్తే అంత మంచిదనే నిపుణుల సూచనలు పాటిస్తే దేశ ప్రజల ఆరోగ్య రక్షణను కల్పించిన వారు అవ్ఞతారని గమనించండి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతులతో చేరలేని వారు ఒకవైపు, మరోవైపు ప్రైవేట్లో చికిత్స చేయించుకోవడానికి లక్షల్లోనే ఖర్చు అవ్ఞతుందన్నది నిజమే కదా! ఇది ఒక్కరికి వస్తే కుటుంబ సభ్యు లను చుట్టేస్తుందన్న భయానక స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ప్రజలు.ఇప్పట్లో కరోనాకుమందులేదు.
టీకా రావడానికి సమయం పడుతుందని అంటున్నవేళ ‘మీకు అనారోగ్యం వస్తే మేమున్నాం అంటూ ఇన్నాళ్లు చెప్పిన బీమా సంస్థలు, మరణించినాక ఇచ్చేది సభ్యుల ధనమే కదా. అవసరాల కోసం ప్రజలు బయట వెళ్లక తప్పడం లేదు.
వెళ్లితే చావును ఇంటికి మోసుకొస్తున్నమనే భీకర స్థితి నుండి కొంతలో కొంతైనా ఆ కుటుంబాలకు తోడ్పాటు ఇచ్చేవిధంగా బీమాసంస్థలు ముందుకు రావాలి.
కొవిడ్ బీమా పాలసీలు అమలులోకి వచ్చేలా చూడాలి. కరోనా వైరస్ చిన్న, పెద్ద,ధనిక, పేద అని తేడా లేకుండా ప్రాణా లతో చెలగాటమాడుతున్నవేళ ప్రభుత్వాలు టీకా, మందులతో పాటు బీమా పాలసీలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెప్పించాలి.
ఆరోగ్యబీమా పాలసీలను రూపొందించి ప్రీమియం నిర్ణయించడం కంటే ముందే ఆయా వ్యాధుల చికిత్సకుఅయ్యే ఖర్చు,జబ్బు ప్రభావం లాంటి అంశాలను బీమా సంస్థలు లెక్కలు వేసుకుంటాయి.నేటికీ కరోనాతో దేశవ్యాప్తంగా ఏడులక్షల కేసులు, 20వేల మంది మరణాలతో మృత్యుఘంటికలు మోగిస్తుంది.
దీని మూలంగా మధ్యపేద తరగతుల ప్రజలు హడలెత్తిపోవ్ఞతున్నారు. పాలకులు కరోనా వైద్యానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వఆస్పత్రుల్లో ఏర్పరచామంటూనే వారికి వైరస్సోకితే మాత్రం కార్పొరేట్ ఆస్ప త్రులకు వెళ్లుతున్నారు.
కరోనాకేమో సమభావం పాలకులకేమో స్వార్థభావమా అని పాలితుల ఆవేదన తీరడానికి కరోనా నివార ణకి వ్యాక్సినో, జీవితానికి ధీమాకోసం బీమా పాలసీలు రావాలి.
పాలకులూ వెంటనే పాలితుల జీవితాల్లో ధీమా నింపండి.
జీవిత బీమా అంటే జీవితంతో పాటు జీవితం తర్వాత కూడా అనే బీమా సంస్థల మాటలకు స్వార్థకత చేకూర్చండి.
- మేకిరి దామోదర్
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/