నిమ్స్‌లో మరో వ్యక్తికి ‘కొవాగ్జిన్‌’ ట్రయల్‌

కాసేపట్లో ఓ వ్యక్తికి కోవాగ్జిన్ ఇస్తామని ప్రకటన

Covaxin-Clinical-Trials-Starts-in-NIMS

హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కలిసి కోవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయిత క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఈరోజు మరో వాలంటీరుకు ఫేజ్‌1 డోస్‌ ఇచ్చేందుకు నిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కాసేపట్లో ఓ వ్యక్తికి కోవాగ్జిన్ ఇచ్చి అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. కాగా, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే. కోవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతినిచ్చింది.
కాగా
క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మూడు రోజుల క్రితం ఇద్దరు వాలంటీర్లకు తొలి డోస్‌లు ఇచ్చారు. వారిని ఐసీయూలో ఉంచి 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించిన అనంతరం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో డిశ్ఛార్జి చేశారు. వారిలో ఎలాంటి అలర్జీలు లేవు. అయితే, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/