బైపిసితో బోలెడు కోర్సులు

కెరీర్‌: విద్య, ఉపాధి, అవకాశం

medical students
medical students

వైద్యవిద్య అనగానే గుర్తొచ్చేది ఎంబిబిఎస్‌. ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి కోర్సు కాలవ్యవధి అయిదున్నరేళ్లు. దంత వైద్యంపై ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బిడిఎస్‌) ఉంది. ఇది నాలుగేళ్ల కోర్సు. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ద్వారా వీటిలోకి ప్రవేశాలను కల్పిస్తారు.
బైపిసి గ్రూప్‌తో ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏం చేయాలి? చాలా మంది విద్యార్థుల దృష్టి ప్రధానంగా వైద్య విద్యపైనే ఉంటుంది. ఇంకొందరు సంబంధిత సబ్జెక్టులతో ఉన్న డిగ్రీల వైపు వెళతారు. ఇవేకాకుండా ఇంకా ఎన్నోదారులు ఉన్నాయి.

మెడికల్‌ కోర్సులు:

వైద్యవిద్య అనగానే గుర్తొచ్చేది ఎంబిబిఎస్‌. ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి కోర్సు కాల వ్యవధి అయిదున్నరేళ్లు. దంత వైద్యంపై ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బిడిఎస్‌) ఉంది. ఇది నాలుగేళ్ల కోర్సు. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ద్వారా వీటిలోకి ప్రవేశాలను కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ఏజెన్సీ (ఎన్‌టిఎ) దీన్ని నిర్వహిస్తోంది. ఈ రెండూ కాస్తఖర్చుతో కూడుకున్నకోర్సులు. ప్రత్యామ్నాయంగా వైద్య రంగంలోనేడిగ్రీని ప్రసాదించే ఆయుష్‌ కోర్సులూఉన్నాయి.

నర్సింగ్‌:

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు నర్సింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. సాధా రణంగా ఎఎన్‌ఎం(యాక్సిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ), జిఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ), బిఎస్‌సి నర్సింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మొదటి రెండు కోర్సులను ఏ గ్రూప్‌ వారైనా ఎంచుకోవచ్చు. బిఎస్‌సి నర్సింగ్‌కు మాత్రం ఇంటర్‌లో బైపిసి చదివిన వారే అర్హులు. అన్ని కోర్సుల్లోకెల్లా బిఎస్‌సి నర్సింగ్‌కు ప్రాధాన్యమెక్కువ. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రభ్తుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు బిఎస్‌సి నర్సింగ్‌లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

పారామెడికల్‌:

అనారోగ్యం వస్తే అందరూ సంప్రదించేది వైద్యులనే. కానీ ఆ వైద్యులకు రోగ నిర్థారణ, చికిత్సల్లో సాయ మందించేవారు పారామెడికల్‌ సిబ్బంది. రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్‌, ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్‌, అనస్తీషియా, ఎంఆర్‌ఐ తదితరమైనవి ఈ విభాగం కిందకివస్తాయి. వీటికి సంబంధించి రెండురకాల కోర్సులు బ్యాచిలర్‌ డిగ్రీ, డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. బ్యాచిలర్‌ కోర్సులకు మూడేళ్లు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, ఆడి యాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ, ఫిజియోథెరపీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, డయాలసిస్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, అనస్తీ షియా టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఎక్స్‌రే టెక్నా లజీ, మెడికల్‌ రికార్డు టెక్నా లజీ మొద లైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఫార్మాసి:

బీ ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులకు ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.బీ ఫార్మాసీ కాలవ్యవధి నాలుగేళ్లు. దీన్ని పూర్తి చేసినవారు ఫార్మసిస్ట్‌, డ్రగిస్ట్‌, పేషెంట్‌ కౌన్సిలింగ్‌, ఫార్మా సంస్థల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ విభాగాల్లో ఉద్యోగావకాశాలను పొందవచ్చు.

బైపిసి తర్వాత డిగ్రీ కోర్సులు అనగానే బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ కోర్సులే గుర్తుకు వస్తాయి. కానీ బయోకెమిస్ట్రీ, బయో టెక్నా లజీ, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మా టిక్స్‌, అగ్రికల్చర్‌ జియాలజీ, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్‌, కమ్యూనిటీ సైన్స్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌, క్లినికల్‌ మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్‌, ఫిషరీస్‌ అండ్‌ వైల్డ్‌ సైన్సెస్‌, ఫారెస్ట్రీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ మొదలైన స్పెషలైజ్డ్‌ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.

అగ్రికల్చర్‌:

వ్యవసాయ, దాని అనుబంధ రంగాలది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరికరాలు మొదలైన వాటిపై ఆసక్తి ఉన్నవారు బిఎస్‌సి అగ్రికల్చర్‌ను ఎంచు కోవచ్చు. ఈ కోర్సు సీట్లను ఎంసెట్‌ ద్వారా భర్తీచేస్తారు. చేపల పెంపకం, సేకరణ పద్ధ తులపై ఆసక్తి ఉన్నవారికి బిఎస్‌సి ఫిషరీస్‌ అనుకూలం. పశు వులు, కోళ్లు, బాతుల పెంపకం, వాటి పోషణ, అభివృద్ధి, ఆహా రం, పోషణ ప్రమాణాలు మొద లైన వాటి గురించి బివిఎస్‌సి యానిమల్‌ హజ్బెండరీలో తెలుసుకోవచ్చు.

తోటలు, ఉద్యానవనాలపై ఆసక్తి ఉన్నవారు బిఎస్‌సి హార్టికల్చర్‌ను ఎంచుకోవచ్చు. హార్టిసెట్‌ ద్వారా దీనిలో ప్రవేశం పొందవచ్చు. ముడి పట్టున ఉత్పత్తి చేసే పట్టు పురుగులకు సంబంధించిన కోర్సు బిఎస్‌సి సెరీకల్చర్‌. పట్టు పురుగుల పెంపకం, సిల్క్‌ గ్రేడింగ్‌, సీడ్‌ టెక్నాలజీ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఈ కోర్సుకు చాలా వరకూ సంస్థలు నేరుగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొద్దిసంస్తలు మాత్రం ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

ఇంకా దేశంలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో అందించే కోర్సులకు రాష్ట్రాల వారీగా పరీక్షలుం టాయి. కానీ దేశంలోని ప్రతి సంస్థ లోనూ ఆయా డిగ్రీల వారీగా 15నుంచి 25శాతం వరకు సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలతో భర్తీచేస్తారు

. కొన్ని జాతీయ సంస్థల్లో మొత్త సీట్లకూ ఈ స్కోరే ప్రమాణికం. అందులో ప్రముఖమైనది ఐకార్‌ నిర్వహించే పరీక్ష. దీని ద్వారా ప్రవేశం పొందిన వారికి ప్రతి నెలా స్టైపెండ్‌నూ అందిస్తారు. దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15శాతం యూజీ సీట్లకు పోటీ పడడానికి ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. దీని ద్వారా మొత్తం 11 రకాల బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/