మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్, కార్పొరేషన్స్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. 11 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి కానున్నాయి. ఈ నెల 18 న మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు/వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/