5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ఉత్కంఠ
New Delhi: దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభం ఐయింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సొం రాష్ట్రాలు, కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీలకు పలు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం విదితమే. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉండగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/