భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి

Counter-fire in Bhadradrikottagudem
Counter-fire -file

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. చర్ల అటవీప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలపై పక్కా సమాచారంతో పోలీసులు తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ చేశారు. గమనించిన మావోలు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులలో ఒక మావోయిస్టు మృతదేహం ఘటన స్థలంలో పడివుండడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు గుర్తించారు. స్థలం నుంచి ఒక 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలదే పైచేయి కావడంతో మావోలు అక్కడ్నించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్టు తెలిసింది

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/