డెక్సామెథసోన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

కరోనా బాధితులకు చికిత్సలో డెక్సామెథసోన్ ను వాడొచ్చన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Dexamethasone

న్యూఢిల్లీ : కరోనా బాధితులకు చికిత్సలో వాడేందుకు డెక్సామెథసోన్ అనే స్టెరాయిడ్ ను కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తీవ్ర వ్యాధి లక్షణాలతో బాధపడేవారిలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇన్ ఫ్లమేషన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు డెక్సామెథసోన్ వాడొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు కరోనా రోగుల చికిత్స, నిర్వహణ నియమావళిని సవరించింది. మిథైల్ ప్రెడ్నినిసోలోన్ కు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది. డెక్సామెథసోన్ ఔషధాన్ని 6 దశాబ్దాలుగా వైద్యరంగంలో వినియోగిస్తున్నారు. 1977 నుంచి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో ఉంటోంది. దీనిపై ఎవరికీ పేటెంట్ లేకపోవడంతో అన్ని దేశాల్లోనూ అందుబాటు ధరల్లోనే లభ్యమవుతోంది. ఇటీవల బ్రిటన్ లో జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో కరోనా బాధితులకు స్వస్థత కలిగించడంలో డెక్సామెథసోన్ మెరుగైన ఫలితాలను ఇచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/