కరోనా వైరస్: విజయవాడలో అనుమానిత కేసు
విజయవాడ: విజయవాడలో ఓ వ్యక్తి తీవ్ర జలుబుతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతడి రక్త నమూనాలను వైద్యులు పుణె ల్యాబ్కు పంపించారు. అయితే ఈ రక్త నమూలనాలు రావడానికి 72 గంటలు పడుతుందని, వస్తే కానీ ఇతనికి వైరస్ ఉన్నది? లేనిది వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత వ్యక్తిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా ఇతడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇటీవలే జర్మనీలో 17 రోజులు బస చేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. జర్మనీ బెంగళూరు, హైదరాబాద్కు విమానంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/