కరోనా పంజా..చైనా ఉత్పత్తులపై నిషేధం విధించిన రాష్ట్రాలు

రేపటి నుంచి అమల్లోకి రానున్న నిషేధం

coronavirus -china
coronavirus -china

ఇంపాల్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈనేపథ్యంలో చైనాకు ఆనుకుని ఉన్న మణిపూర్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే బట్టలు, ఆహార ఉత్పత్తులపై మణిపూర్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ఈ నిషేధం రేపటి నుంచే అమల్లోకి రాబోతోంది. అంతేకాదు చైనా, మయన్మార్ సరిహద్దుల్లో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చైనా నుంచి మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వీరిని ఇంట్లోనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇతరులెవరినీ వారితో కలవనీయడం లేదు. కాగా కరోనా వైరస్ బారిన ఇప్పటి వరకు దాదాపు 34 వేల మంది పడ్డారు. 700 మందికి పైగా చనిపోయారు.

తాజా క్ర్రిడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/