వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందుంది
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్తో పాటు 7 అంబులెన్స్లను సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని అన్నారు. ఇవాళ ఏడు అంబులెన్స్లు, రూ. కోటి విలువైన ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్లో మరిన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/