భారత్‌లో 1,45,380 కరోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,167

corona-india
corona-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,535 మందికి కొత్తగా కరోనా సోకగా, 146 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,45,380కి చేరగా, మృతుల సంఖ్య 4,167కి చేరుకుంది. 80,722 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 60,490 మంది కోలుకున్నారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/