తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,59,776

Hyderabad: తెలంగాణలో వరుసగా రెండో రోజూ వెయ్యి కంటే తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 948 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు.
దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,415 కి పెరిగింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/