గాంధీలో చేరిన 8 మంది కరోనా అనుమానితులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా (కోవిడ్-19) కలకలం రేపుతోంది. తెలంగాణ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగా ణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా సోకిన వ్యక్తిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తుండగా, మరోవైపు ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల వారంతా ఇటలీ, ఇండొనేషియా, ఇజ్రాయెల్, జపాన్ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/