కరోనా నివారణకు హెఫా ఫిల్టర్లు: తెలంగాణ ప్రభుత్వం

HEPA Filters
HEPA Filters

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఆస్పత్రిలో లేని హెఫా(హై ఎఫిసియన్సీ పర్టిక్యులేట్‌ ఎయిర్‌) ఫిల్టర్లను తెప్పించాలని కెసిఆర్‌ సర్కారు యోచనలో ఉంది. సుమారు ఒక్కొక్క హైఫా ఫిల్టర్‌కు రూ.2 కోట్ల మేర ఖరీదు చేసే ఈ ఫిల్టర్లు నాలుగింటిని కొనుగోలు చేయాలని, వాటిని గాంధీతో సహా కరోనా అనుమానితులు అధికంగా ఉండే ఆస్పత్రుల్లో అమర్చాలని నిర్ణయించింది. వీటిని గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల వద్ద ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కరోనా వ్యాధి లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అంతేకాకుండా వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఫిల్టర్లు వ్యాధిగ్రస్థులు, అనుమానితులు అధికంగా వచ్చి పోతుండే ప్రాంతాల్లో పెట్టడం ద్వారా, వారు తుమ్మినా, దగ్గినా గాల్లోకి వచ్చే వైరస్ ను ఒడిసిపట్టి, స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతూ ఉంటుంది.

తాజా తెర-సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/