ఏపిలో మరో 45 కరోనా పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసులు 2,452

corona virus – ap

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 8,092 శాంపిళ్లను పరీక్షించగా మరో 45 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,452 అని తెలిపింది. అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,680 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో నెల్లూరులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 54కి చేరింది.


తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/