ఏపిలో మరో 48 కరోనా కేసులు
కేసుల సంఖ్య మొత్తం 2,137
అమరావతి: ఏపి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. గడిచిన గత 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 86 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,137గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 948 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,142 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/