ప్రపంచ వ్యాప్తంగా 84 లక్షలు దాటిన కరోనా కేసులు
మొత్తం కరోనా మృతులు 4,51,263
న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్నది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాప్తిచెందిన వైరస్ తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచంలో ఇప్పటివరకు 84 లక్షల 129 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా 4,51,263 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో 44,14,991 మంది కోలుకోగా, మరో 35,33,875 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికాలో ఇప్పటివరకు 1,19,941 మంది బాధితులు మృతిచెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,34,471కి చేరింది. ఇప్పటివరకు 9,18,796 మంది బాధితులు కోలుకోగా, మరో 11,95,734 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/