విశాఖలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా మహిళ
బిడ్డ, తల్లి ఇద్దరూ క్షేమం
Visakhapatnam: విశాఖపట్నంలో కరోనా సోకిన 23 ఏళ్ల మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) లో సిజేరియన్ ద్వారా మహిళ పండంటి మగబిడ్డ ను ప్రసవించింది
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు కరోనావైరస్ తో చికిత్స పొందుతున్నది.. నేటి ఉదయం విమ్స్ హాస్పిటల్ లో అన్ని జాగ్రత్తలతో సిజేరియన్ జరిగిందని తెలిపారురు.
బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డైరెక్టర్ వర ప్రసాద్ ఒక పత్రికా ప్రకటనలో వివరించారు. శిశువు నమూనా కరోనా పరీక్షకు పంపినట్లు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/