24.1% మందికి కరోనా వైరస్: ఐసీఎంఆర్ సర్వే

ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం కేసులు

corona tests-File
corona tests-File

New Delhi: ప్రస్తుతం దేశంలో 24.1 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు ఐసీఎంఆర్ సెరో సర్వే తెలియజేస్తోంది. ఈ సర్వేను 2020 డిసెంబరు-2021 జనవరి మధ్య కాలంలో ఐసీఎంఆర్ నిర్వహించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో కేసుల సరళిని గుర్తించారు. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్ సోకినట్టేనని ఐసీఎంఆర్ పేర్కొంది.

10 ఏళ్లకు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని,. 10 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం 400 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేసి నిర్వహించి నిర్ధారణకు వచ్చారు.
అటు, 25.6 శాతం ఆరోగ్య సిబ్బంది కొవిడ్ బారినపడినట్టు కూడా వెల్లడైందని తెలిసింది. ఆరోగ్య సిబ్బందిలో 100 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు పట్టణాల్లోనే ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్నారని సర్వే వెల్లడించింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/