దేశంలో 85వేలు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో దేశంలో 3,970 మందికి కరోనా ..మొత్తం మరణాల సంఖ్య 2,752

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా సోకింది. గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,752కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 30,153 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,035 మంది చికిత్స పొందుతున్నారు. కాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/