వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం

ఒకే కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్

Corona virus again in Wuhan

వుహాన్‌: చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా మహమ్మారి పుట్టుకోచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వుహాన్ కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టింది. దీంతో లాక్ డౌన్ ఎత్తివేశారు. ఆఫీసులు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇతర వినోద ప్రధాన కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. వ్యాపారాలన్నీ షురూ అయ్యాయి. కరోనా సద్దుమణిగిందనుకున్న తరుణంలో మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వుహాన్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఒకే కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/