ఇటలీ పర్యాటకులకు ప్రత్యేక చికిత్సలు
దేశీయ పర్యటనకు వచ్చిన మొత్తం 21 మంది
న్యూఢిల్లీ: భారత్కు వచ్చిన ఇటలీ పర్యాటకులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. మొత్తం 21 మంది సందర్శకులు రాగా వీరిలో 14 మందికి కరోనా వైరస్ ఉందని నిర్దారణ కావడంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఢిల్లీలోని ఐటీబీపీ కేంద్రానికి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. తాజాగా వీరిని మెడాంటా వైద్యశాలకు తరలించారు. ఖప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో ఇటలీ బాధితులను ఆసుపత్రిలో చేర్చుకున్నాంగ అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. బాధితుల కోసం ‘క్వారెంటైల్ ఫ్లోర్’ ఏర్పాటుచేసి వీరికి ప్రత్యేకంగా అందులో చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/