కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 92
మంగళవారం కొత్తగా 8 కేసులు
Kurnool: కర్నూలు జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో రోజురోజుకి బాధితుల సంఖ్య పెరుగుతోంది .
మంగళవారం కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 92 కుచేరుకుంది.
మంగళవారం ఉదయం 11 గంటలకు మొత్తం 81 శాంపిల్స్ రిపోర్ట్ లు ల్యాబ్ నుంచి రాగా వీటిలో 73 నెగటివ్ గా తేలాయి . 8 పాజిటివ్ గా రా వచ్చాయి.
పాజిటివ్ గా వచ్చిన కేసులలో కర్నూల్ సిటీ లో అధికంగా నమోదయ్యాయి .
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/