గాంధీ ఆసుపత్రిలో 10కి చేరిన కరోనా బాధితులు

చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా… గాంధీ ఆసుపత్రిలో చేరిక

coronavirus
coronavirus

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఇప్పుడు అన్ని దేశాల్లోనూ వణుకుపుట్టిస్తుంది. థాయ్ లాండ్, హాంకాంగ్ ల్లోనూ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. భారత్ లో సైతం ఈ మహమ్మారి బారినపడి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది. ఈ ఉదయమే ఓ యువతి కేరళ నుంచి రాగా, ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆమె కూడా గాంధీ ఆసుపత్రిలో చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/